హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్లో శ్రీనిధి దక్కన్ ఫుట్బాల్ క్లబ్(ఎస్డీఎఫ్సీ) హ్యాట్రిక్తో మెరిసింది. టోర్నీలో తమదైన దూకుడు కనబరుస్తూ గురువారం జరిగిన మ్యాచ్లో ఎస్డీఎఫ్సీ 2-1 తేడాతో ఇండియన్ ఆరోస్పై అద్భుత విజయం సాధించింది. పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన మ్యాచ్లో ఎస్డీఎఫ్సీ తరఫున చాంగ్టె(30ని), డేవిడ్ మనోజ్ (69ని) గోల్స్ చేయగా, రోడ్రిగ్స్ (45ని) ఆరోస్కు ఏకైక గోల్ అందించాడు. ఈ విజయంతో 13 పాయింట్లతో ఉన్న ఎస్డీఎఫ్సీ ప్రస్తుతం మూడో స్థానంలో నిలిచింది.