అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలల పునఃప్రారంభంతో పాటు ఏడాదిపాటు పాఠశాలల నిర్వహణను తెలియజేస్తూ ప్రభుత్వం అకడమిక్ క్యాలెండర్ను విడుదల చేసింది. ప్రతి ఏటా జూన్ 12న పాఠశాలలు పునః ప్రారంభమై ఏప్రిల్ 23 వరకు కొనసాగేవి. ఈ విద్యాసంవత్సరం(2022-23 ) జులై 5 నుంచి పునఃప్రారంభం అయ్యే పాఠశాలలు వచ్చే ఏడాది ఏప్రిల్ 29వ తేదీ వరకు కొనసాగుతాయని వెల్లడించింది. పాఠశాలలు 220 రోజులు పని చేయనున్నాయి.
ఒకటి నుంచి 9 వ తరగతులకు సమ్మెటివ్-2 పరీక్షలు ఏప్రిల్ 27తో ముగుస్తాయని రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి(ఎస్సీఈఆర్టీ) అకడమిక్ స్పష్టం చేసింది. ఒకటి నుంచి 5 తరగతుల ఫౌండేషన్ ప్లస్ పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 3.30 వరకు కొనసాగించాలని సూచించారు. సాయంత్రం 3.30 నుంచి 4 వరకు ఆటలు, పునశ్చరణ తరగతుల నిర్వహణ చేపట్టాలని వెల్లడించారు.
ప్రీహైస్కూల్, హైస్కూల్, హైస్కూల్ ప్లస్ పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు, 4 గంటల నుంచి 5గంటల వరకు ఆటలు, పునశ్చరణ తరగతులను ఆయా బడులు ఐచ్ఛికంగా నిర్వహించుకోవచ్చని ఎస్సీఈఆర్టీ తెలియజేసింది.