న్యూఢిల్లీ: భగత్సింగ్ కోశ్యారీ కమిటీ సిఫారసు చేసినట్టుగా ఒకే ర్యాంకు- ఒకే పెన్షన్ (ఓఆర్ఓపీ) విధానాన్ని అమలు చేసేలా చూడాలని కోరుతూ ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. ఇండియన్ ఎక్స్ సర్వీస్మెన్ మూమెంట్ ఈ పిటిషన్ను దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు తీర్పును రిజర్వ్ చేశారు. ప్రస్తుతం ఐదేండ్లకోసారి సమీక్ష చేసి పే రివిజన్ చేస్తున్నారని, దాన్ని ఏటా ఆటోమేటిక్గా రివిజన్ చేయాలని కోశ్యారీ కమిటీ సిఫారసు చేసింది.
సీల్డ్ కవర్ రిపోర్టులొద్దు: సుప్రీంకోర్టు
సీల్డ్ కవర్లో పెట్టిన రిపోర్టులు తమకు సమర్పించొ ద్దని ఓ కేసులో సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. సోషల్ మీడియాలో జడ్జిలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఓ వ్యక్తిని జైలుకు పంపారు. అనంతరం అతను బెయిల్పై విడుదలయ్యాడు. నిందితుడి వ్యాఖ్యలను సీల్డ్ కవర్లో సమర్పిస్తామని ఓ న్యాయవాది.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణతో కూడిన ధర్మాసనానికి తెలిపారు.