ఆదిలాబాద్ ఫొటోగ్రాఫర్ , మే 20 : ఆదిలాబాద్ పట్టణంలోని రెవెన్యూ గార్డెన్ సమీపంలో ఎస్సీ బాలుర వసతిగృహం ఉంది. ఇది మొన్నటిదాకా కళావిహీనంగా ఉండేది. ప్రస్తుతం పాఠశాలలకు సెలవులు ఉండడంతో అధికారులు భవనానికి రంగులు వేయించారు.
గోడలపై అందమైన వర్ణచిత్రాలు గీయించారు. ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం, పౌష్టికాహారం వంటి పథకాల అమలును సూచిస్తూ వేసిన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.