న్యూఢిల్లీ: బీసీసీఐ రాజ్యాంగంలో సవరణ చేపట్టాలని సుప్రీంలో వేసిన పిటిసన్ను జూలై 21వ తేదీకి వాయిదా వేశారు. జస్టిస్ ఎన్వీ రమణతో కూడిన ధర్మాసనం ఈ కేసును రేపటికి వాయిదా వేసింది. బీసీసీఐ అధ్యక్షుడ గంగూలీ, కార్యదర్శి షాతో పాటు ఇతర ఆఫీసు బేరర్ల పదవీకాలాన్ని పొడిగించేందుకు అనుమతి ఇవ్వాలని బీసీసీఐ సుప్రీంను కోరింది. గంగూలీ, షాలకు కూడా పొడగింపు ఇవ్వాలని ఆ పిటిషన్లో కోరారు. 2020లో ఆ పిటిషన్ దాఖలు చేశారు. బోర్డు రాజ్యాంగంలోని ఆరు రూల్స్ను సవరించేందుకు అనుమతి కావాలని బీసీసీఐ సుప్రీంను ఆశ్రయించింది.తక్షణమే ఈ పిటిషన్పై చర్చ చేపట్టాలని కోరారు. గంగూలీ, షా పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబర్లో ముగియనున్నది.