న్యూఢిల్లీ: ఇక నుంచి ఎస్బీఐ క్రెడిట్ కార్డు మీద ఈఎంఐపై ఏదైనా కొంటే అదనపు ఛార్జీల్ని భరించాల్సిందే. రిటైల్ అవుట్లెట్స్, ఈ-కామర్స్ వెబ్సైట్లో వస్తూత్పత్తుల్ని కొని, ఆ కొనుగోలును నెలసరి సమాన వాయిదా చెల్లింపుగా మార్చుకుంటే..అటువంటి లావాదేవీపై రూ.99 ప్రాసెసింగ్ ఫీజుతో సహా పన్నుల్ని వసూలు చేయనున్నట్లు ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ ప్రకటించింది. ఈ నిర్ణయం డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈఎంఐ కొనుగోళ్లపై వసూలు చేసే వడ్డీకి ఈ ఛార్జీలు అదనమని సంస్థ తన ఖాతాదారులకు ఈమెయిల్ ద్వారా తెలిపింది. అయితే కొనుగోలు డిసెంబర్ 1కి ముందుగా జరిగి, ఆ తేదీ తర్వాత ఈఎంఐ బుకింగ్ జరిగితే ప్రాసెసింగ్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.