బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ప్రధాన కోచ్గా భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ ఎంపికయ్యాడు. రెండేండ్ల పాటు ఆర్సీబీతో బంగర్ కొనసాగుతాడని జట్టు యాజమాన్యం మంగళవారం ప్రకటించింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో బ్యాటింగ్ సలహాదారుగా కొనసాగిన సంజయ్కు ఆర్సీబీ హెడ్ కోచ్గా పదోన్నతి కల్పించింది. వచ్చే సీజన్లో ఎలాగైనా తొలి ట్రోఫీ కైవసం చేసుకోవాలనే కసితో బెంగళూరు కనిపిస్తున్నది. ఈ క్రమంలో బంగర్ మాట్లాడుతూ.. ‘ రానున్న వేలం కోసం మేము ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టాం. ఆర్సీబీ అభిమానుల చిరకాల కల ఐపీఎల్ ట్రోఫీని సాధించడానికి సిద్ధంగా ఉన్నాం’ అని అన్నాడు.