లండన్: వింబుల్డన్ మిక్స్డ్ డబుల్స్లో సానియా జోడి సెమీఫైనల్స్కు చేరింది. ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. క్రొయేషియాకు చెందిన మేట్ పావిక్తో జతకట్టి.. మిక్స్డ్ డబుల్స్లో ఆడుతుంది. అయితే సుదీర్ఘ కెరీర్ ఉన్న సానియా మీర్జా చివరి సారి వింబుల్డన్ ఆడుతున్న విషయం తెలిసిందే. సానియా-పావిక్ జోడి క్వార్టర్స్లో 6-4, 3-6, 7-5 తేడాతో నాలుగవ సీడ్ గాబ్రిలా, జాన్ పీర్స్ జోడిని ఓడించింది. ఈ టోర్నీలో సానియా-పావిక్ జోడి ఆరో సీడ్గా పోటీలోకి దిగింది. ఈ మ్యాచ్లో సానియా తన ఫోర్హ్యాండ్ షాట్లతో హోరెత్తించింది. పవర్ఫుల్ షాట్స్ ఆడుతూ ప్రత్యర్థుల్ని బెంబేలెత్తించింది. సానియా మీర్జా వింబుల్డన్లో మహిళల డబుల్స్లోనూ ఆడుతోంది. కానీ సానియా, లూసీ జోడి తొలి రౌండ్లోనే నిష్క్రమించింది.