దుబాయ్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా- లూసీ హడెకా (చెక్ రిపబ్లిక్) జోడీ దుబాయ్ టెన్నిస్ చాంపియన్షిప్ సెమీ ఫైనల్కు దూసుకెళ్లింది. మహిళల డబుల్స్ క్వార్టర్స్లో సానియా- హడెకా జంట 7-5 6-3తో షుకో అయోమ (జపాన్)- అలెగ్జాండ్రా క్రనిక్ (సెర్బియా)ను ద్వయాన్ని చిత్తు చేసింది. మ్యాచ్ మొత్తం ప్రత్యర్థి జోడీపై ఆధిక్యం ప్రదర్శించిన సానియా జంట సునాయాస విజయంతో ముందడుగు వేసింది. సెమీస్లో టాప్ సీడ్ ఎనా షిబహర (జపాన్)- షువాయి జాంగ్ (చైనా)తో అమీతుమీ తేల్చుకోనుంది.