టోక్యో: ఒలింపిక్స్లో టెన్నిస్ మహిళల డబుల్స్లో సానియా మీర్జా జోడీ ఓటమిపాలైంది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో ఉక్రెయిన్కు చెందిన కిచునాక్ లియుద్మ్యాలా- కిచునాక్ నదియా జోడీ చేతిలో 0-6, 7-6, (10-8) తేడాతో సానియా మీర్జా- అంకితా రైనా జోడీ ఓడిపోయింది.
పురుషుల సింగిల్స్ నుంచి బ్రిటన్ స్టార్ అటగాడు ఆండీ ముర్రే నుంచి తప్పుకున్నాడు. 34 ఏండ్ల ముర్రే తొడ కండరాలకు గాయం కావడంతో సింగిల్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే డబుల్స్లో మాత్రం కొనసాగుతానని వెల్లడించాడు. డిఫెండింగ్ చాంపియన్ అయిన ఆండీ ముర్రే 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించాడు. మళ్లీ నాలుగేండ్ల తర్వాత జరిగిన రియో ఒలింపిక్స్లో తన పతకాన్ని నిలబెట్టుకున్నాడు.