లక్నో : సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి భగవతి సింగ్(89) ఆదివారం మృతిచెందారు. లక్నోలోని భక్షి కా తలాబ్ ప్రాంతంలో ఆయన చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భగవతి సింగ్ కోరిక మేరకు అంత్యక్రియలు నిర్వహించలేదు. మృతదేహాన్ని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీకి అప్పగించనున్నట్లు తెలిపారు. భగవతి సింగ్ మృతిపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆ భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూరుగాక, కుటుంబ సభ్యులకు బలాన్ని అందించాల్సిందిగా కోరుతూ ట్వీట్ చేశారు.