న్యూఢిల్లీ: జర్మన్ ఓపెన్లో భారత్కు బుధవారం మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. డబుల్స్లో సాయి ప్రతీక్- ఇషాన్ భట్నాగర్ జోడీ శుభారంభం చేయగా.. సిక్కిరెడ్డి- అశ్వినీ, అర్జున్-ధ్రువ్ కపిల జంటలు నిరాశపర్చాయి. పురుషుల డబుల్స్ తొలి పోరులో ఇషాన్, ప్రతీక్ జోడీ 21-15, 21-16 తేడాతో కల్లమ్ హెమ్మింగ్, స్టీవెన్ స్టాల్వుడ్ (ఇంగ్లండ్) ద్వయంపై అలవోక విజయం సాధించింది. 30 నిమిషాల్లోనే ముగిసిన మ్యాచ్ను వరుస గేముల్లో కైవసం చేసుకుంది. మరో డబుల్స్లో క్రిష్ణ ప్రసాద్, విష్ణువర్ధన్ జంట 24-22, 21-11తో జపాన్ జోడీపై గెలిచి రెండోరౌండ్లోకి ప్రవేశించింది. మహిళల డబుల్స్లో సిక్కిరెడ్డి-అశ్విని పొనప్ప జోడీ 13-21, 13-21తో జపాన్ ద్వయం నమీ మత్సుయమ, చిహారు షిదా చేతిలో ఓటమిపాలైంది.