జయం సినిమాతో సిల్వర్ స్క్రీన్పై మెరిసింది మరాఠి ముద్దుగుమ్మ సదా (Sadaa). ఆ తర్వాత బాలకృష్ణ, చిరంజీవి, ఎన్టీఆర్, నితిన్తోపాటు పలువురు టాలీవుడ్ హీరోలతో స్క్రీన్పై మెరిసింది. సదా సిల్వర్ స్క్రీన్కు దూరమై నాలుగేళ్లవుతోంది. అయితే టెలివిజన్ షోలు, సోషల్ మీడియాతో నెటిజన్లతో టచ్లో ఉంటుంది. ఈ బ్యూటీ తన గ్యాంగ్తో కలిసి మధ్యప్రదేశ్లోని పెంచ్ నేషనల్ పార్కు(Pench National Park)లో సఫారి రైడ్కు వెళ్లింది.
అది కూడా భయంకరమైన పెద్ద పులులు (Tigers) తిరుగుతున్న ప్రాంతంలోకి ఏ మాత్రం భయం లేకుండా వెళ్లింది సదా . సఫారీలో నిలబడి అరణ్యంలో తిరుగుతున్న ఆ పులులను తన కెమెరాలో బంధించింది. ఆగస్టు 12న సాయంత్రం పెంచ్కు చేరుకునే ముందు పాంథర్ కనబడింది. నాలుగు సఫారీల్లో నా ట్రిప్ ముగించుకుని తిరిగొస్తున్నపుడు మళ్లీ కనబడింది. బ్లాక్ పాంథర్(Black panther)ను చూడగానే ప్రేమలో పడిపోయా..అంటూ ఆ ఫొటోలు, వీడియోలను ఇన్ స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్లో వర్క్ షెడ్యూల్ ఉన్నప్పటికీ.. ఈ అందాన్ని చూసేందుకు విమానంలో వెళ్లాలని నిర్ణయించుకున్నా. నేనెన్నడూ ఇలాంటి పిచ్చి పని చేయలేదు. కానీ ఈ సమయం చాలా విలువైనది..అంటూ క్యాప్షన్ ఇచ్చింది సదా.