బడంగ్పేట, జూన్ 6: కేవలం రూ.5లకే ప్లేట్ ఇడ్లీ అందించే క్యాంటీన్ను మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రారంభించారు. సీఎస్సీ అకాడమీ సహకారంతో ఆర్యన్ క్యూర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రామోజీ శోభారాణిమల్లికార్జున్ ఆధ్వర్యంలో మీర్పేట చౌరస్తాలో ఏర్పాటైన ఈ సెంటర్ ద్వారా ఉదయం ఏడు గంటల నుం చి తొమ్మిది వరకు ప్రతి రోజు 150 పేదలు, పారిశుధ్య కార్మికులకు టిఫిన్ అందివ్వనున్నారు. కొవిడ్ సమయంలో పేదలు, పా రిశుధ్య కార్మికులు పడుతున్న ఇబ్బందులు గుర్తించి ఈ సంస్థ ముందుకొచ్చి తక్కువ ధరకే టిఫిన్ అందివ్వడం అభినందనీయమని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, టీఆర్ఎస్ మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షురాలు సిద్దాల లావణ్యబీరప్ప, వర్కింగ్ ప్రెసిడెంట్ అర్కల కామేశ్రెడ్డి పాల్గొన్నారు.