న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: సబర్మతి ఆశ్రమం పునరభివృద్ధిపై గుజరాత్ రాష్ర్టానికి చుక్కెదురైంది. ప్రాజెక్ట్కు గ్రీన్సిగ్నల్ ఇస్తూ గుజరాత్ హైకోర్టు గతేడాది నవంబర్ 21న ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. గాంధీ మునిమనువడు తుషార్ గాంధీ పిటిషన్ను మళ్లీ పరిశీలించాలని ఆదేశించింది. గుజరాత్లో భూపేంద్ర పటేల్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రూ.1,200 కోట్లతో ఆశ్రమ పునరుద్ధరణ పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఆశ్రమ పవిత్రత దెబ్బతింటుందని తుషార్ గాంధీ కోర్టుకు వెళ్లారు.