బడంగ్పేట, జనవరి20 : మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లెలగూడ జడ్పీహెచ్ఎస్కు రూ. 62 లక్షలు, ఎంపీపీఎస్ స్కూల్కు రూ.23 లక్షలు కేటాయించారు. విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గంలోని పాఠశాల కావడంతో ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ఆమె ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. పాఠశాలలో ఉన్న 900మంది విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. పాఠశాలల్లో ఉన్న మౌలిక సదుపాయాల కల్పనకు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇప్పటికే తొంభై శాతం పనులు పూర్తి అయినట్లు ప్రధానోపాధ్యాయురాలు నాగమణి తెలిపారు.
ఎంపీపీఎస్ స్కూల్లో అభివృద్ధి పనులు :
జిల్లెలగూడ జడ్పీహెచ్ఎస్లో అభివృద్ధి పనులు :
ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దుతాం
మన ఊరు మన బడి పైలెట్ ప్రాజెక్ట్ పథకం కింద జిల్లెలగూడ జడ్పీహెచ్ఎస్, ఎంపీపీఎస్, రాజేందర్ నగర్లోని శివరాంపల్లి, మోడల్ హలియా, మహబూబియా పాఠశాలలను తీసుకున్నాం. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దబోతున్నాం. విద్య కోసం ఎంత ఖర్చు అయినా చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న పాఠశాలల్లో పనులు చివరి దశకు వచ్చాయి. – విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి