హైదరాబాద్/న్యూఢిల్లీ, జనవరి 3: బంగారం ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన ధరలు మంగళవారం మరింత పైకి ఎగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు ఎగబాకడంతో దేశీయంగా ధరలు అధికమవుతున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.500 పెరిగి రూ.55,940కి చేరుకున్నది.
పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు అధికమవడంతో కిలో వెండి ఏకంగా రూ.1,370 అధికమై రూ.71,220కి చేరింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.540 పెరిగి రూ.55,580కి చేరుకోగా, 22 క్యారెట్ల ధర రూ.500 అధికమై రూ.50, 950 పలికింది. అలాగే వెయ్యి రూపాయలు అధికమైన కిలో వెండి రూ.75, 500కి చేరుకున్నది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,843 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా..వెండి 24.37 డాలర్ల వద్ద కొనసాగుతున్నది.