‘రౌడీబాయ్స్’ చిత్రానికి ప్రేక్షకులు అద్భుతమైన ఆదరణ కనబరుస్తున్నారు. రెండోవారం పూర్తయ్యేసరికి 12కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సినిమా ఫుల్న్ల్రో పదిహేనుకోట్ల వసూళ్లను సాధిస్తుందని అంచనా వేస్తున్నాం’ అన్నారు ప్రముఖ నిర్మాత దిల్రాజు. ఆయన సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ కథానాయకుడిగా పరిచయమైన ‘రౌడీబాయ్స్’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలైన అన్ని కేంద్రాల్లో విజయపథంలో పయనిస్తున్నది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో దిల్రాజు మాట్లాడుతూ ‘రెండోవారం రూ. 3.98 కోట్ల గ్రాస్ వచ్చింది. యువతరం సినిమాకు బాగా కనెక్ట్ కావడం వల్ల చక్కటి వసూళ్లు వస్తున్నాయి. ఆశిష్ కెరీర్కు ఈ సినిమా శుభారంభాన్నిచ్చింది. ప్రతిభావంతుడైన నటుడిగా అతనికి గుర్తింపు లభించింది. ఏ సినిమా విజయానికైనా ప్రేక్షకుల ఆదరణ, వసూళ్లనే ప్రామాణికాలుగా తీసుకోవాలి. ఓ హీరో అరంగేట్ర చిత్రానికి ఈ స్థాయిలో కలెక్షన్స్ రావడం సినిమా స్టామినా ఏమిటో తెలియజేస్తున్నది. ‘రౌడీబాయ్స్’ మా అంచనాల్ని అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అన్నారు.
ఫిబ్రవరిలో సానుకూల పరిస్థితులు
ఫిబ్రవరి మూడోవారంలోగా కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టి పెద్ద సినిమాల విడుదలకు సానుకూల పరిస్థితులు ఏర్పడుతాయని దిల్రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఫిబ్రవరి 25 నుంచి పెద్ద సినిమాల రిలీజ్లు మొదలవుతాయి. విడుదల తేదీల్లో ఎలాంటి అయోమయం లేకుండా నిర్మాతలు ముందే చర్చించుకొని నిర్ణయానికొస్తారు. అందరి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు అవగాహనతో ముందుకెళ్తారు’ అని చెప్పారు. ఏపీ సినిమా టికెట్ రేట్ల సవరణ వ్యవహారానికి ఫిబ్రవరిలోగా పరిష్కారం లభిస్తుందన్న నమ్మకం ఉందని.. ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫారసుల ఆధారంగా నిర్ణయాలు జరుగుతాయని దిల్రాజు పేర్కొన్నారు.