అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో జరుగుతున్న చివరిదైన ఐదో టీ20లో మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత్కు శుభారంభం లభించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓపెనర్గా బరిలో దిగాడు. హిట్మ్యాన్ రోహిత్ శర్మ ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. రోహిత్ బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. పవర్ప్లే ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 60 పరుగులు చేసి మెరుగైన స్థితిలో నిలిచింది. ప్రస్తుతం రోహిత్(35), కోహ్లీ(17) క్రీజులో ఉన్నారు. ఓపెనింగ్ జోడీని విడదీసేందుకు ఇంగ్లాండ్ బౌలర్లు శ్రమిస్తున్నారు.