ఆమె అందమైన అమ్మాయి. ఎత్తు ఐదు అడుగులు. రోగులకు మందులు ఇస్తుంది..వృద్ధులకు సేవలు చేస్తుంది, హోటల్లో సర్వ్ చేస్తుంది. ఆకట్టుకొనే రూపంతో ఉన్న ఆమె.. మనిషి అనుకొంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఆమె ఎవరోకాదు మైత్రి అనే హ్యూమనాయిడ్ రోబో. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు చెందిన ఫణికుమార్ దీనిని ఆవిష్కరించారు. దీనిని ఎందుకోసం తయారు చేశారు? ఈ రోబో కు ఎంత ఖర్చు అయ్యింది … ఎలాంటి పనులు చేస్తుందో తెలుసుకోవాలని ఉంది కదా.. మరెందుకు ఆలస్యం ఈ రోబో ప్రత్యేకతలేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామా…