సిటీబ్యూరో, జనవరి 26 (నమస్తే తెలంగాణ): అభివృద్ధిలో దూసుకుపోతున్న టీఆర్ఎస్ ..పార్టీ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించింది. గ్రేటర్లో చరిత్రను సృష్టిస్తూ సొంతంగా వరుసగా రెండోసారి మేయర్ స్థానాన్ని దక్కించుకుని సత్తాను చాటగా, అటు అసెంబ్లీ స్థానాల్లోనూ మెజార్టీ స్థానంలో నిలిచింది. ఇందులో భాగంగానే పార్టీని మరింత పటిష్టం చేస్తూ పెద్దఎత్తున సభ్యత్వాలను చేపట్టింది. ఈ క్రమంలోనే తిరుగులేని శక్తిగా పార్టీని నిలపడమే లక్ష్యంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ బుధవారం జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షులను ఖరారు చేశారు.
ఉద్యమ సమయంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా కట్టెల శ్రీనివాస్ యాదవ్, 2014 సంవత్సరంలో మైనంపల్లి హన్మంతరావు దాదాపు రెండేళ్ల పాటు గ్రేటర్ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కొనసాగారు. ప్రస్తుతం జిల్లాల వారీగా అధ్యక్షులను నియమించారు. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాకు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, రంగారెడ్డి జిల్లాకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిలకు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు.
హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా మాగంటి గోపీనాథ్
మాగంటి గోపీనాథ్
తండ్రి: మాగంటి కృష్ణమూర్తి
తల్లి: మహానంద కుమారి
జననం: జూన్ 2. 1963
పుట్టిన ప్రాంతం : హైదర్గూడ, హిమాయత్నగర్ భార్య సునీత, ఇద్దరు కుమార్తెలు. ఒక కుమారుడు
రాజకీయ నేపథ్యం
పార్టీని మరింత బలోపేతం చేస్తా
నాపై పార్టీ పెట్టిన బాధ్యతని నెరవేరుస్తాను. జిల్లాలో టీఆర్ఎస్ ఇప్పటికే చాలా బలంగా ఉంది. రానున్న రోజుల్లో ఎదురు లేని శక్తిగా పార్టీని మార్చేందుకు నా వంతుగా కృషి చేస్తాను. జిల్లాలో టీఆర్ఎస్ సీనియర్ నేతలతో సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తాను. కార్యకర్తలకు సరైన న్యాయం దకేలా చూడడంతో పాటు వారిని పార్టీ కార్యక్రమాలలో మరింతగా భాగస్వామ్యం చేస్తాను. హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్, వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లకు కృతజ్ఞతలు.
రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా మంచిరెడ్డి
రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని నియమించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఏడు ఏండ్లు బాధ్యతలు నిర్వర్తించడంతోపాటు వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం, పలు కీలక పదవుల్లో పనిచేసిన అనుభవం ఉండడంతో మంచిరెడ్డి కిషన్ రెడ్డిని అధికార పార్టీ జిల్లా అధ్యక్షులుగా టీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం నియమించింది. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ తనకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షులు కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జిల్లా మంత్రి పి.సబితాఇంద్రారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతానికి కృషి చేస్తానని, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలను అందరిని కలుపుకొని ముందుకెళ్తామన్నారు. అదేవిధంగా జిల్లాలోని టీఆర్ఎస్ పార్టీ ప్రతీ కార్యకర్తకు అండగా నిలుస్తానన్నారు.
బయోడేటా..
పేరు :మంచిరెడ్డి కిషన్ రెడ్డి
తల్లిదండ్రులు :భూపాల్ రెడ్డి, పద్మమ్మ
సతీమణి :ముకుందమ్మ
కూతురు :శీతల్
కుమారులు :ప్రశాంత్కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి
విద్యాభ్యాసం :బీఏ గ్రాడ్యుయేషన్(నిజాం కాలేజీ)
స్వగ్రామం :ఎలిమినేడు గ్రామం,ఇబ్రహీంపట్నం మండలం
పుట్టిన తేది :ఏప్రిల్ 11, 1953