బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ చివరి సినిమా ‘శర్మాజీ నమ్కీన్’ ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో జుహీ చావ్లా, సుహైల్ నయ్యర్, తారుక్ రైనా తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. హితేష్ భాటియా దర్శకత్వం వహించారు. రిటైర్డ్ ఉద్యోగి శర్మ..వంటల్లో తన ప్రతిభ చూపించుకోవాలనే కలను ఎలా నెరవేర్చుకున్నాడు అనేది చిత్ర కథాంశంగా ఉండబోతున్నది. చెఫ్గా శర్మాజీ చేసే సందడి తెరపై నవ్విస్తుందని చిత్రబృందం చెబుతున్నారు. ఇది ఒక దిగ్గజ నటుడికి నివాళి లాంటి చిత్రమని వారు అంటున్నారు. ఈ నెల 31న ‘శర్మాజీ నమ్కీన్’ ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్నది. కేన్సర్తో పోరాడుతూ 2020 ఏప్రిల్ 30న రిషి కపూర్ కన్నుమూశారు. అప్పటికి కొన్ని నెలల ముందు నుంచే అనారోగ్యంతో ఉన్న రిషి..శర్మాజీ పాత్రకు పూర్తి షూటింగ్ చేయలేకపోయారు. దీంతో నటుడు పరేష్ రావల్ను శర్మాజీ పాత్ర చిత్రీకరణ కోసం నిర్మాతలు తీసుకున్నారు.