న్యూఢిల్లీ : రూ . 22,842 కోట్ల విలువైన బ్యాంక్ స్కామ్ ఆరోపణలకు సంబంధించి ఏబీజీ షిప్యార్డ్ వ్యవస్ధాపక చైర్మన్ రిషి అగర్వాల్ను సీబీఐ అరెస్ట్ చేసింది. అగర్వాల్ ఇతరులపై సీబీఐ నేరపూరిత కుట్ర, మోసం, అవినీతి నిరోధక చట్టం వంటి పలు అభియోగాలు మోపింది.
ఏబీజీ షిప్యార్డ్ 2001 నుంచి ఎస్బీఐతో లావాదేవీలు సాగిస్తోంది. 2005 నుంచి 2012 మధ్య ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ సహా 28 బ్యాంకులతో కూడిన కన్సార్షియం ఈ కంపెనీకి పెద్ద మొత్తంలో రుణాలను అందించింది. 2019 ఏప్రిల్ మార్చి 2020 మధ్య ఏబీజీ షిప్యార్డ్ అకౌంట్ను కన్సార్షియం ఫ్రాడ్గా ప్రకటించింది.
కంపెనీ ఖాతా 2013 నవంబర్ ౩౦న ఎన్పీఏగా మారింది. దీంతో కంపెనీ నుంచి పలు బ్యాంకులకు రూ 22,842 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని సీబీఐ పేర్కొంది. బ్యాంకు రుణాలను కంపెనీ తన విదేశీ అనుబంధ కంపెనీకి దారిమళ్లించిందని సీబీఐ ఆరోపించింది.