మాంచెస్టర్: ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్ను 2-1 తేడాతో ఇండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే థ్రిల్లింగ్గా సాగిన మూడవ వన్డేలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 21 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో జట్టుతో చేరిన పంత్.. చివరి వరకు క్రీజ్లో ఉండి 125 రన్స్తో నాటౌట్గా నిలిచాడు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన ప్రజెంటేషన్ సెర్మనీలో ఓ గమ్మత్తు జరిగింది. ప్లేయర్లు అందరూ షాంపేన్తో హంగామా చేశారు. ఆ సమయంలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచిన రిషబ్ పంత్ తన వద్ద ఉన్న షాంపేన్ బాటిల్ను మాజీ కోచ్ రవిశాస్త్రికి ఇచ్చారు. మైక్తో ఉన్న రవిశాస్త్రితో ముచ్చటించిన పంత్.. అతనికి తన వద్ద ఉన్న షాంపేన్ బాటిల్ ఇచ్చి మళ్లీ జట్టు సభ్యులతో కలిసిపోయాడు. సెలబ్రేషన్స్ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మపై పంత్ తన వద్ద ఉన్న షాంపేన్ను స్ప్రే చేశాడు. శిఖర్ ధావన్, హర్షదీప్ సింగ్పై మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన వద్ద ఉన్న షాంపేన్ స్ప్రే చేశాడు. నిర్ణయాత్మక మూడవ వన్డేలో ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా కూడా కీలక ఆటతీరును ప్రదర్శించాడు. బౌలింగ్లో నాలుగు వికెట్లు తీసి, ఆ తర్వాత బ్యాటింగ్లోనూ హాఫ్ సెంచరీ చేశాడు.
Virat Kohli offering Ravi Shastri the champagne bottle after the win. pic.twitter.com/vchQCOH8Zv
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 17, 2022
WINNERS 🏆🇮🇳 pic.twitter.com/iYu3JSsI5j
— Sky Sports Cricket (@SkyCricket) July 17, 2022
Pant gave Shastri 🔥 pic.twitter.com/dE1Xgx81w4
— GK (@gkagg9) July 17, 2022