ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్కు భారీ జరిమానా పడింది. మ్యాచ్ ఫీజులో వంద శాతాన్ని ఫైన్గా వేశారు. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో రిషబ్ అనుచితంగా ప్రవర్తించారు. చివరి ఓవర్లో మూడవ బంతిని నోబాల్గా ప్రకటించాలని పంత్ అసహనం వ్యక్తం చేస్తూ బ్యాటర్లను వెనక్కి రావాలని సంకేతాలిచ్చాడు. ఆ ఘటనలో ఇవాళ ఐపీఎల్ నిర్ణయం తీసుకున్నది. నియమావళి ఉల్లంఘన కింద రిషబ్ పంత్కు వంద శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా విధిస్తున్నట్లు ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు. అయితే పంత్ ఆటను అడ్డుకున్న సమయంలో అతనికి వంతపాడిన శార్దూల్ ఠాకూర్కు మ్యాచ్ ఫీజులో 50 శాతం ఫైన్ వేశారు. ఇక అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రేకు .. ఒక మ్యాచ్ నిషేధం విధించారు. ప్రవీణ్ ఆమ్రే మైదానంలోకి వెళ్లి అంపైర్లకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ కోడ్లోని ఆర్టికల్ 2.7 ప్రకారం తప్పును అంగీకరిస్తున్నట్లు పంత్ తెలిపాడు. 2.8 కోడ్ నియమావళి ప్రకారం తప్పు జరిగినట్లు శార్దూల్ అంగీకరించాడు. ఐపీఎల్ వేసిన జరిమానాను ఇద్దరూ అంగీకరించారు. అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రేకు మ్యాచ్ బ్యాన్తో పాటు వంద శాతం మ్యాచ్ ఫీజును ఫైన్గా వేశారు.