చండీఘర్: హర్యానాలో ఉన్న బీజేపీ-జేజేపీ (జననాయక్ జనతా పార్టీ) సంకీర్ణ ప్రభుత్వంలో చీలికలు రానున్నట్టు తెలుస్తున్నది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేసే అవకాశం ఉన్నది.
బీజేపీ నేత విప్లవ్ దేవ్ జేజేపీపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు జేజేపీ తమకు లబ్ధి చేకూరేలా వ్యవహరించలేదని, తామే జేజేపీ నేత దుష్యంత్ చౌతాలాను మంత్రిని చేసి వారికి లబ్ధి చేకూర్చామని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో హర్యానాలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వంలో అంతా సవ్యంగా సాగడం లేదని అర్థం అవుతున్నది.