కరోనా నుంచి కోలుకొన్నందుకు ఓ కుటుంబం మేడారం సమ్మక్క-సారలమ్మలకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించి మొక్కు చెల్లించుకొన్నది. హైదరాబాద్లోని పెద్ద అంబర్పేట్కు చెందిన రంగు వెంకటేశ్గౌడ్ కుటుంబంలో అందరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. అంతా కోలుకో వడంతో బుధవారం మేడారం వచ్చి తల్లులకు మొక్కు చెల్లించుకొన్నారు. ఎనిమిది క్వింటాళ్ల ఎత్తు బెల్లాన్ని అమ్మవార్లకు సమర్పించారు. అక్కడికి వచ్చిన వారికి పంచిపెట్టారు.