న్యూఢిల్లీ: కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ఎన్నికల ప్రచారానికి రాజకీయ పార్టీలు నియమించుకునే స్టార్ క్యాంపెయినర్ల సంఖ్యను ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆదివారం పునరుద్ధరించింది. దీంతో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలు గరిష్టంగా 40 మందిని, గుర్తింపు పొందని పార్టీలేవైనా 20 మందిని స్టార్ క్యాంపెయినర్లుగా నియమించుకోవచ్చు. 2020 అక్టోబర్లో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్ల సంఖ్యను ఈసీ తగ్గించింది.