Virat Kohli | వెస్టిండిస్తో మూడు మ్యాచ్ల సిరీస్ (WI vs Ind Odi Series)లో భాగంగా తొలి వన్డేలో నెగ్గి 1-0తో ముందంజలో ఉన్న టీమ్ఇండియా.. శనివారం జరిగిన రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలయిన విషయం తెలిసిందే. యంగ్ గన్స్ను బరిలోకి దింపాలని భావించిన యాజమాన్యం కెప్టెన్ రోహిత్ శర్మ, టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిలకు విశ్రాంతి ఇచ్చింది. ఇక ఈ మ్యాచ్కు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ వాటర్ మైదానంలో బాయ్ (Water boy)గా దర్శనిమిచ్చాడు.
ఇన్నింగ్స్ 37 ఓవర్లో డ్రింక్స్ బ్రేక్ ఉండగా.. విరాట్ కోహ్లీ, స్పిన్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ మైదానంలో వాటర్ బాయ్స్గా మారారు. చాహల్తో కలిసి మైదనంలోకి వెళ్ళిన కోహ్లి క్రీజులో ఉన్న కులదీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్లకు మంచి నీళ్లు, అరటి పండ్లను అందజేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
1 hi to ❤️ hai, kitne baar jeetoge? King Kohli turns water boy!
.
.#INDvWIAdFreeonFanCode #INDvWI pic.twitter.com/CYE2uvNAC2— FanCode (@FanCode) July 29, 2023
వెస్టిండిస్తో రెండో వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 40.5 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ గైర్హాజరీలో ఈ మ్యాచ్కు పాండ్యా కెప్టెన్గా వ్యవహరించాడు. గత మ్యాచ్లో అర్ధశతకంతో ఆకట్టుకున్న యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ (55 బంతుల్లో 55; 6 ఫోర్లు, ఒక సిక్సర్) మరోసారి హాఫ్సెంచరీతో మెరువగా.. శుభ్మన్ గిల్ (34) పర్వాలేదనిపించాడు. తర్వాత బ్యాటింగుకు దిగిన వెస్టిండీస్ ఆటగాళ్లు నిదానంగా ఆడుతూపాడుతూ విజయాన్ని అందుకున్నారు. షై హోప్ (63), కార్టీ (48), కైల్ మేయర్స్ (36) పరుగులతో రాణించడంతో కేవలం 36.4 ఓవర్లలోనే విండీస్ జట్టు లక్ష్యాన్ని ఛేదించింది.