బంజారాహిల్స్, నవంబర్ 23: శాంతి భద్రతలను కాపాడడంతో పాటు నేరాలు జరిగిన వెంటనే మరింత వేగంగా స్పందించేలా పనితీరును మెరుగుపర్చుకోవాలని వెస్ట్జోన్ డీసీపీ ఏఆర్.శ్రీనివాస్ సూచించారు. బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు వద్ద ఇటీవల జరిగిన సంఘటనల నేపథ్యంలో బంజారాహిల్స్,జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లలో పనిచేసే అధికారులతో పాటు పెట్రోలింగ్ సిబ్బందితో మంగళవారం డీసీపీ ఏఆర్.శ్రీనివాస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పీఎస్ల పరిధిలో మరింత అప్రమత్తంగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఏదైనా సంఘటన జరిగిన వెంటనే ఆయా ప్రాంతాల్లోని పెట్రోకార్ , బ్లూకోల్ట్స్ సిబ్బం ది అలెర్ట్ కావాలని సూచించారు. ఘటనా స్థలానికి చేరుకోవడంతో పాటు నేరం చేసిన వారు ఏయే మార్గాల్లో వెళ్లే అవకాశం ఉందో ఆయా ప్రాంతాల్లోని పెట్రోలింగ్ సిబ్బందిని కూడా అప్రమత్తం చేయాలని సూచించారు. పెండింగ్ కేసుల పరిష్కారంతో పాటు వర్టికల్ పర్ఫార్మెన్స్ను మెరుగుపర్చుకోవాలని సూచించారు. సమావేశంలో బంజారాహిల్స్ ,జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్లు శివచంద్ర,రాజశేఖర్రెడ్డి. డీఐలు ఆకుల రమేష్, హఫీజుద్దీన్, ఎస్ఐలు, పెట్రోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు.