రామంతాపూర్, నవంబర్ 12: కబ్జాకు గురైన శ్మశాన వాటిక స్థలాన్ని కాపాడాలని కోరతూ రామంతాపూర్ కాటికాపరుల సంఘం ప్రతినిధులు వల్ల బాబురావు, వల్ల సత్యనారాయణ ఉప్పల్ తహసీల్దార్ గౌతంకుమార్కు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. రామంతాపూర్ భగాయత్ పరిధిలోని మూసీ నాలా సర్వే నంబర్ 52, 13లో గల 8 గుంటల భూమిలో శ్మశాన వాటిక స్థలంలో ముత్తాతలనాటి నుంచి శ్మశాన వాటిక ఉందని వారు తెలిపారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు వల్ల జంగయ్య, బండారు శివకుమార్, గోసుల సాయికుమార్, వల్ల సుధాకర్, వల్ల శివకుమార్ పాల్గొన్నారు.