శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాన్ని బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ప్రభుత్వ , ప్రభుత్వేతర కార్యాలయాలు, విద్యాసంస్థలు, కాలనీల్లో జాతీయ పతాకావిష్కరణ చేపట్టారు. ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ మియాపూర్లోని క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం చేశారు. కొత్తగూడ బొటానికల్ గార్డెన్లో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఒంటేరు ప్రతాప్రెడ్డి, ఆయా డివిజన్లలో కార్పొరేటర్లు, మియాపూర్ స్టేషన్లో సీఐ తిరుపతిరావు, ట్రాఫిక్ సీఐ సుమన్, హఫీజ్పేట్ డివిజన్ పరిధిలో సత్తయ్య మెమోరియల్ ఫౌండేషన్ కార్యాలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్గౌడ్, తదితర ప్రాంతాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. – శేరిలింగంపల్లి జోన్ బృందం, జనవరి 26