న్యూఢిల్లీ, మార్చి 9: దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారుల (ఎంఎస్ఎంబీ) కోసం సరికొత్త టారిఫ్ ప్లాన్లను రిలయన్స్ జియో మంగళవారం ఆవిష్కరించింది. బ్రాడ్బాండ్, వాయిస్ కాల్స్, వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్లు, ఇతర డిజిటల్ సొల్యూషన్స్తో ఈ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. మార్కెట్లో ప్రస్తుతం లభిస్తున్న ఇతర టెల్కోల ప్లాన్లతో పోల్చితే తమ ప్లాన్ ధరలు పదో వంతు మాత్రమేనని జియో డైరెక్టర్ ఆకాశ్ అంబానీ తెలిపారు. ఇక మొత్తం ఏడు రకాల బండిల్డ్ ప్లాన్లను జియో పరిచయం చేసింది. భాగస్వాములతో కలిసి జియో ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఈ సులువైన డిజిటల్ సొల్యూషన్స్ను అందించనున్నది. దేశవ్యాప్తంగా 5 కోట్ల ఎంఎస్ఎంబీలకు ఈ ప్లాన్లు చేరువ కావాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు సంస్థ తెలిపింది. ప్రపంచం డిజిటలైజేషన్ వైపు పరుగులు పెడుతున్న నేపథ్యంలో భారీ సంస్థలకు ధీటుగా చిరు వ్యాపారులూ నిలబడేందుకు తమ ప్లాన్లు దోహదం చేయగలవన్నది