ముంబై: ఎల్గర్ పరిషత్-మావోయిస్టుల సంబంధాల కేసులో వరవరరావుతోపాటు మరో ఏడుగురి నిందితులకు బాంబే హైకోర్టు బెయిల్ నిరాకరించింది. ఈ కేసులో నిందితురాలు, న్యాయవాది సుధా భరద్వాజ్కు డిఫాల్ట్ బెయిల్ (ఒక వ్యక్తి అరెస్టు అయినప్పటి నుంచి నిర్ణీత సమయంలోగా పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయకపోతే బెయిల్ మంజూరు చేయడం) మంజూరు చేసింది. బుధవారం బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం.. ఈ నెల 8న సుధా భరద్వాజ్ను ముంబై స్పెషల్ ఎన్ఐఏ కోర్టు ముందు హాజరుపర్చాలని, ఆమె బెయిల్ షరతులు, విడుదల తేదీని స్పెషల్ కోర్టు నిర్ణయిస్తుందని పేర్కొంది. కాగా, ఈ కేసులో అరెస్టు అయిన 16 మంది సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తల్లో డిఫాల్ట్ బెయిల్ పొందిన తొలి వ్యక్తి సుధా భరద్వాజే.