మెండోరా: గోదావరి నది పరిసర ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఎస్సారెస్పీ రిజర్వాయర్లోకి ఇన్ఫ్లో తగ్గుముఖం పట్టిందని ఏఈఈ వంశీ తెలిపారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువన ఉన్న మహారాష్ట్ర ప్రాంతం నుంచి వరదలు తగ్గాయని చెప్పారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 14,800 ఇన్ఫ్లో వచ్చి చేరుతోందన్నారు.
ఎస్కేప్ గేట్ల నుంచి దిగువ గోదావరిలోకి 7 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 500 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్తాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీల) 1090.80 అడుగులు (89.212టీఎంసీల) నీటి నిల్వ ఉందని వెల్లడించారు. ఈ ఏడాది ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 288.655 టీఎంసీల వరద నీరు వచ్చిందన్నారు. ఈ సీజన్లో కాలువలకు, మిగులు జలాలను గోదావరిలోకి 218.429 టీఎంసీల నీటిని వదిలినట్లు ఏఈఈ తెలిపారు.