MI vs RCB : ముంబైతో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరు వికెట్లు కోల్పోయింది. నాట్ సీవర్ బ్రంట్ వేసిన 17వ ఓవర్లో శ్రేయాంక పాటిల్ (4) బౌల్డ్ అయింది. తొలి బంతికి అలిసా పెర్రీ (23) ఎల్బీగా ఔటయ్యింది. ప్రస్తుతం రీచా ఘోష్ (12), మేగన్ షట్ (1) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్లో కనికా ఆహుజా(12)ను యస్తిక స్టంపౌట్ చేసింది. అంతకుముందు హీథర్ నైట్(12)ను అమేలియా ఔట్ చేసింది. 33 పరుగుల వద్ద కెప్టెన్ స్మృథి మంధాన (24) ఔటయ్యింది. 17ఓవర్లకు 6వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. తొలి ఓవర్లోనే ఆర్సీబీకి షాక్ తగిలింది. గత మ్యాచ్లో చెలరేగిన ఓపెనర్ సోఫీ డెవినే ఖాతా తెరవకుండానే రనౌట్ అయింది.