క్రిష్ బండిపల్లి హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘రావణలంక’. బి.ఎస్.ఎన్ రాజు దర్శకుడు. అశ్విత, త్రిష కథానాయికలుగా నటించారు. ఈ నెల 19న ఈ చిత్రం విడుదలకానున్నది. మంగళవారం హైదరాబాద్లో ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. బిగ్టికెట్ను తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీవిశ్వనాథ్, టీఎఫ్సీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ విడుదలచేశారు. ఈ సందర్భంగా హీరో క్రిష్ మాట్లాడుతూ ‘సినిమాను తీయడం కంటే దానిని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడమే నిజమైన విజయంగా నేను భావిస్తా. ఆ ప్రయత్నంలో నేను సక్సెస్ అయ్యా. కమర్షియల్ ఎంటర్టైనర్గా తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది’ అన్నారు. ‘హీరోగా, నిర్మాతగా రెండు బాధ్యతల్ని క్రిష్ సమర్థవంతంగా నిర్వహించాడు. భవిష్యత్తులో అతడు మరిన్ని మంచి సినిమాలు చేయాలి’ అని ఆర్కే గౌడ్ ఆకాంక్షించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘అభినవరాముడు లాంటి ఓ యువకుడి కథ ఇది. తన ప్రేమను సఫలం చేసుకోవడానికి అతడు ఎలాంటి పోరాటం చేశాడన్నది ఆకట్టుకుంటుంది’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇటీవల దర్శకుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన కాశీవిశ్వనాథ్ను, తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్చైర్మన్గా ఎన్నికైన ప్రతాని రామకృష్ణగౌడ్ను చిత్రబృందం సన్మానించింది.