తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో (Karthika Brahmotsavam) శుక్రవారం రథోత్సవం(Rathotsavam) కన్నులపండువగా జరిగింది. రథోత్సవం ఆలయ నాలుగు మాడ వీధుల్లో కొనసాగగా భక్తులు పెద్ద సంఖ్యలో రథాన్ని లాగారు. రథోత్సవం అనంతరం మధ్యాహ్నం రథమండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారిని విశేషంగా అలంకారించారు.