రష్మిక మందన్న తెలుగులో మరో భారీ అవకాశాన్ని సొంతం చేసుకుంది. దళపతి విజయ్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాతలు దిల్రాజు-శిరీష్ ఓ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కథానాయికగా రష్మిక మందన్నను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది. త్వరలో ఈ సినిమా సెట్స్మీదకు రానుంది.