బెంగళూరు: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ ఫైనల్కు రంగం సిద్ధమైంది. రికార్డు స్థాయిలో 41 సార్లు టైటిల్ పట్టిన రంజీ రారాజు ముంబై బుధవారం నుంచి ప్రారంభం కానున్న తుదిపోరులో రెండు దశాబ్దాల తర్వాత ఫైనల్ చేరిన మధ్యప్రదేశ్తో అమీతుమీ తేల్చుకోనుంది. బ్యాటింగ్, బౌలింగ్లో సమతూకంగా ఉన్న ముంబైకి.. అమోల్ మజుందార్ కోచ్గా వ్యవహరిస్తుండగా.. చంద్రకాంత్ పండిట్ పర్యవేక్షణలో మధ్యప్రదేశ్ బరిలోకి దిగనుంది.
యువ ఆటగాళ్లతో నిండి ఉన్న ముంబై ఫేవరెట్గా కనిపిస్తున్నా.. తాజా సీజన్లో నిలకడగా ఆడుతున్న మధ్యప్రదేశ్ను తక్కువ అంచనా వేసేందుకు లేదు. కెప్టెన్ పృథ్వీ షా ధనాధన్ ఆటతో ముంబైకి శుభారంభాలు అందిస్తుండగా.. మరో ఓపెనర్ యశస్వీ జైస్వాల్ వరుస సెంచరీలతో అదరగొడుతున్నాడు. ఇక తన కెరీర్లోనే టాప్ ఫామ్లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్ను కట్టడి చేయడం మధ్యప్రదేశ్ బౌలర్లకు శక్తికి మించిన పనే.
తాజా సీజన్లో ఆడిన ఐదు మ్యాచ్ల్లో అతడు 800కు పైగా పరుగులు చేయడం గమనార్హం. మిడిలార్డర్లో అర్మాన్ జాఫర్ వంటి క్లాసిక్ ప్లేయర్ ఉండటం ముంబైకి అదనపు బలం కానుంది. సువేద్ పార్కర్, హార్దిక్ తమోరె కూడా బ్యాట్తో సత్తాచాటగలవారే.