నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘రంగ్దే’ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ వేడుక శుక్రవారం కర్నూల్లో జరిగింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ నెల 26న రిలీజ్కానుంది. నితిన్ మాట్లాడుతూ ‘కర్నూల్ రావడం నాకిదే మొదటిసారి. ఇక్కడి ప్రజల ప్రేమాభిమానాలు బాగున్నాయి. ‘రంగ్దే’ ఆహ్లాదభరితమైన ప్రేమకథ. యూత్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకుంటుంది’ అన్నారు.