ముంబై: బాలీవుడ్ నటుడు రణ్ధీర్ కపూర్ మతిమరుపుతో బాధపడుతున్నట్లు నటుడు రణ్బీర్ కపూర్ తెలిపారు. రాజ్కుమార్ కుమారుడైన రణ్ధీర్ అనేక హిట్ చిత్రాల్లో నటించారు. కల్ ఆజ్ ఔర్ కల్, జీత్, జవానీ దివానీ, లఫంగే, రాంపూర్ కా లక్ష్మణ్ హాత్ కి సఫాయి లాంటి చిత్రాల్లో రణ్ధీర్ నటించారు. రణ్ధీర్ సోదరులైన రిషీ, రాజీవ్ కపూర్లు కొన్నాళ్ల క్రితం మరణించిన విషయం తెలిసిందే.
శర్మాజీ నమ్కీన్ చిత్రంలో రిషీ కపూర్ నటించారు. ఆ చిత్రం తాజాగా రిలీజైంది. ఆ చిత్రాన్ని చూసిన రణ్ధీర్.. ఆ ఫిల్మ్లో నాన్న బాగా నటించారని, ఆయన ఎక్కడ ఉన్నారని, ఆయనతో మాట్లాడాలని ఉందని అన్నట్లు రణ్బీర్ తెలిపారు. ప్రస్తుతం రణ్ధీర్ మతిమరుపుతో బాధపడుతున్నారని, ఆయనకు ఆ వ్యాధి ఇప్పుడిప్పుడే ఆరంభమైందని రణ్బీర్ తెలిపాడు. రెండేళ్ల క్రితం రిషి కపూర్ మరణించిన విషయం తెలిసిందే. రణ్ధీర్ కపూర్కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కరిశ్మా, కరీనా కపూర్లు ఆయన పిల్లలే.