ప్రపంచం నలుమూలలా ఉంటున్న మనుషుల ఆహారపు అలవాట్లు చాలా రకాలుగా ఉంటాయి. సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను చాలా మంది తింటారు. ఐతే మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి 32ఏండ్లుగా ప్రతిరోజూ రాళ్లను మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నాడు. సత్రా జిల్లాలోని అదార్కి ఖుర్ద్ గ్రామంలో నివసిస్తున్న రామ్దాస్ బోడ్కే అనే వృద్ధుడు అందరిలాగే సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు. మిగతా వారికి భిన్నంగా ఆయన ఆహారానికి బదులుగా రాళ్లు తింటాడు.
ఎందుకిలా?
78ఏళ్ల రామ్దాస్ ప్రతీరోజూ 250 గ్రాముల రాళ్లను ఆహారంగా తీసుకుంటాడు. చాలా రోజుల పాటు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడిన ఆయన రాళ్లు తినడం ప్రారంభించాడు. చాలా కాలం చికిత్స పొందినప్పటికీ అతడి నొప్పిని తగ్గించే ఔషధం ఏదీ పనిచేయలేదు. కడుపు నొప్పితో ఇబ్బందిపడుతున్న ఆయన తన గ్రామంలో నివసిస్తున్న ఒక వృద్ధ మహిళ సలహా తీసుకున్నాడు. ఆమె తన సమస్యకు పరిష్కారంగా రోజూ రాళ్ల తినాలని చెప్పింది. అప్పటి నుంచి రాళ్లు తినడం కొనసాగిస్తున్నాడు.
ఇటీవల రామ్దాస్ చాలా ఆనందంగా రాళ్లు తింటున్న వీడియో వైరల్ కావడంతో ఇప్పుడు అతడు సోషల్మీడియాలో హాట్టాపిక్గా మారాడు. తన కుటుంబసభ్యులు అతనికి రాళ్లు దొరక్కుండా చేసినా కూడా ఫలితం లేకపోయింది. రామ్దాస్కు రాళ్లు తినే అలవాటు అనేది మానసిక ఆరోగ్య సమస్య అయి ఉండొచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.