రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం పూనేలో ప్రారంభమైంది. మూడు వారాల పాటు సుదీర్ఘంగా సాగనున్న తాజా షెడ్యూల్లో రామ్చరణ్తో పాటు ప్రధాన తారాగణంపై దర్శకుడు శంకర్ కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. కియారా అద్వాణీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, సునీల్ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో రూపొందుతున్న 50వ చిత్రమిది కావడం గమనార్హం.