ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల సరసన మెరిసి, తన నటన, గ్లామర్తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి రంభ. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లోనూ నటిస్తూ అప్పట్లో దేశవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం వెండితెరకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ అభిమానులకు మాత్రం నిరంతరం సోషల్మీడియాలో టచ్లో ఉంటున్నది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రంభ.. తన వ్యక్తిగత, సినీ జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నది.
ముఖ్యంగా నటుడు జేడీ చక్రవర్తితో ఉన్న అనుబంధం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. తాను, జేడీ చక్రవర్తి కలిసి నటించిన ‘బొంబాయి ప్రియుడు’ సినిమా సమయం నుంచి తమ మధ్య ఎంతో బలమైన స్నేహం ఏర్పడిందని ఆమె గుర్తుచేసింది. జేడీ ఎప్పుడూ ఎంతో సరదాగా ఉంటాడని, ఆయన పకన ఉంటే సమయమే తెలిసేది కాదని చెప్పుకొచ్చింది. అయితే, ఇంతటి గాఢమైన స్నేహం ఉన్నప్పటికీ, తన వివాహానికి ఆహ్వానించినా ఆయన రాకపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేసింది రంభ. ఆ సమయంలో ఆమె చాలా బాధపడిందట, తర్వాత జేడీకి ఫోన్ చేసి బాగా కోప్పడిందట కూడా! ఇక తన కెరీర్ ఎదుగుదల, పాత్రల ఎంపిక గురించి ప్రస్తావిస్తూ.. ‘సినీ ప్రయాణం ఆరంభంలో గ్లామర్ పాత్రలు ఎకువగా చేసినా, ఆ తర్వాత ప్రయోగాత్మక పాత్రలు చేసి నటిగా నిరూపించుకున్నా.
మేకర్స్ ఎకువగా గ్లామర్ పాత్రల కోసమే సంప్రదించేవార’ని పేర్కొంది రంభ. ఈ తరం హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టమని.. భవిష్యత్తులో అవకాశం వస్తే ఈ ఇద్దరి సరసన స్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని తన మనసులోని మాట వెల్లడించింది. ఇప్పటికే జూనియర్ ఎన్టీయార్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేశానని గుర్తుసింది. కాగా, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 1990-2000 కాలంలో అగ్ర కథానాయికగా తనదైన ముద్ర వేసిన స్టార్ హీరోయిన్ రంభ అసలు పేరు విజయలక్ష్మి. విజయవాడకు చెందిన ఈమె ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తెరకెకించిన ‘ఆ ఒకటీ అడకు’ చిత్రంలో టాలీవుడ్కు పరిచయమైంది. తరువాత వరుస హిట్లతో టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనిపించుకుంది.