హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ హైదరాబాద్ పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. సాయంత్రం 5 గంటలకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు ఇవాళ ఆయన తన ట్విట్టర్లో వెల్లడించారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహం.. రామానుజాచార్యకు ఇస్తున్న ఘనమైన నివాళి అని, ఆయన ఆలోచనలు, ప్రబోధనలు ఇప్పటికీ ప్రేరణ కల్పిస్తాయని ఆయన పేర్కొన్నారు. 11వ శతాబ్ధానికి చెందిన భగవద్రామానుజులు గొప్ప భక్తి ఉద్యమాన్ని సాగించారు. అయితే ఆయనకు చెందిన 216 ఫీట్ల ఎత్తు ఉన్న స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించనున్నారు. సర్వమత సమానత్వం కోసం రామానుజులు ప్రబోధనలు చేశారు. స్టాచ్యూను పంచలోహాలతో తయారు చేశారు. 54 ఫీట్ల ఎత్తు ఉన్న భద్రవేది బేస్పై ఆ విగ్రహాన్ని అమర్చారు. రామానుజాచార్య ఆశ్రమానికి చెందిన శ్రీ చిన్నజీయర్ స్వామి ఈ విగ్రహా నిర్మాణం చేపట్టారు. ప్రధాని కార్యక్రమ సమయంలో రామానుజాచార్య జీవిత విశేషాలను త్రీడీ రూపంలో ప్రజెంట్ చేయనున్నారు. 108 దివ్యదేశాలను కూడా ప్రధాని విజిట్ చేస్తారు. జాతి, కుల, మత విబేధాలు లేకుండా అందరి సమానత్వం కోసం రామానుజాచార్య అవిశ్రాంతంగా పనిచేశారు. ఈ కార్యక్రమం తో పాటు ఇక్రిశాట్లో జరిగే 50వ వార్సికోత్సవ వేడుకల్లోనూ ప్రధాని పాల్గొననున్నారు.
At 5 PM, I will join the programme to inaugurate the ‘Statue of Equality.’ This is a fitting tribute to Sri Ramanujacharya, whose sacred thoughts and teachings inspire us. https://t.co/i6CyfsvYnw
— Narendra Modi (@narendramodi) February 5, 2022