ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో భారీ హిట్ కొట్టిన రామ్ సినిమాల స్పీడ్ పెంచాడు. ఈ ఏడాది రెడ్ అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన ఉస్తాద్ ఇందులో డ్యూయల్ రోల్ పాత్ర పోషించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. ఇక రీసెంట్గా లింగుస్వామి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు అఫీషియల్గా ప్రకటించాడు. బైలింగ్యువల్ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీలో కృతి శెట్టి కథానాయికగా నటించింది.
తాజాగా రామ్ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శీనుతో కలిసి రామ్ ఓ సినిమా చేయనుండగా, దీనిపై త్వరలోనే క్లారిటీ రానుందని అంటున్నారు. బోయపాటి చెప్పిన స్టోరీ లైన్ రామ్కు నచ్చడంతో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడట. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలోను రామ్ ఓ సినిమా చేయనున్నాడట.