పంజాబీ సుందరి రకుల్ప్రీత్సింగ్ ప్రస్తుతం హిందీ చిత్రసీమలో బిజీగా ఉంది. ఆమె కథానాయికగా నటిస్తున్న ‘ఛత్రీవాలీ’ చిత్రం షూటింగ్ జరుపుకొంటున్నది. ఇందులో ఆమె కండోమ్ టెస్టర్గా విభిన్నమైన పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు సంబంధించిన భారీ షెడ్యూల్ ఇటీవలే లక్నోలో ముగిసింది. ఈ సందర్భంగా మాట్లాడిన రకుల్ప్రీత్సింగ్ పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది.
బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానితోఈ భామ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ జంట త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారనే వార్తలొస్తున్నాయి. ఇదే విషయమై రకుల్ప్రీత్సింగ్ను ప్రశ్నించగా..తమ ప్రేమప్రయాణం సంతోషంగా గడిచిపోతున్నదని, వివాహానికి సమయం రావాలని చెప్పింది. ‘దేనికైనా సమయం రావాలి. పెళ్లి కుదిరితే మీ అందరికి తెలియజేస్తా’ అని రకుల్ప్రీత్సింగ్ పేర్కొంది.