రాజన్న సిరిసిల్ల రూరల్, నవంబర్ 2: రైతులు కొనుగోలు కేం ద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ గడ్డం నర్సయ్య కోరారు. మున్సిపల్ పరిధిలోని పెద్దబోనాలలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళతో కలిసి మంగళవారం ప్రారంభించి, మాట్లాడారు. ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించాలని కోరా రు. ఇక్కడ ఆర్బీఎస్ మండల కన్వీనర్ వొజ్జల అగ్గిరాము లు, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, కౌన్సిలర్లు కల్లూరి లత, మధు, కీర్తి కమాలాకర్రావు, ఏవో తిరుపతి, ఏడీఎంసీ భూలక్ష్మి, మహాలక్ష్మి, వీఏఈవో ఉన్నారు.
ఇల్లంతకుంట, నవంబర్ 2: గూడెప్పల్లిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, రంగంపేటలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని, కేంద్రాల్లోనే విక్ర యించి మద్దతు ధర పొందాలన్నారు. అనంతరం గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. ఇక్కడ వైస్ ఎం పీపీ సుధగోని శ్రీనాథ్గౌడ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ గొడుగు తిరుపతి, ఆర్బీఎస్ జిల్లా డైరెక్టర్ మాధవరెడ్డి, సర్పంచ్ గట్ల మల్లారెడ్డి, ఎంపీటీసీ తీగల పుష్పలత, ఉప సర్పంచ్ కొట్టె మల్లేశం, మేడిపెల్లి లక్ష్మి, ప్రశాంత్, ఏఎంసీ డైరెక్టర్లు జంగిటి కొమురయ్య, కడగండ్ల తిరుపతి, వార్డు సభ్యుడు రామకృష్ణ, నేతలు ఆరె కొముయ్య, లక్ష్మారెడ్డి, రాజేశం, రాజిరెడ్డి, అమరేందర్రెడ్డి, నాగరాజు, శ్రీనివాస్ ఉన్నారు.
ఎల్లారెడ్డిపేట, నవంబర్ 2: బుగ్గరాజేశ్వర తండాలో కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ అజ్మీరా రజితతో కలిసి ఎం పీపీ పిల్లి రేణుక ప్రారంభించారు. ఇక్కడ సీఈవో మేనేజర్ ప్రకాశ్రావు, సీఈవో సతీశ్, తిరుపతినాయక్, నారాయణరెడ్డి, రవి, మోహన్, రాజు, ప్రకాశ్, హేమాజీ, నరేశ్, భాస్క ర్, మదన్ తదితరులు ఉన్నారు.
చందుర్తి, నవంబర్ 2: చందుర్తి సహకార సంఘం పరిధిలోని రామన్నపేట, ఎన్గల్, జోగాపూర్ గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్ ప్రారంభించారు. రైతులు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు. ఇక్కడ సర్పంచులు దుమ్మ అంజయ్య, లింగంపల్లి సత్తయ్య, మ్యాకల పరశురాములు, ఎంపీటీసీ మ్యాకల గణేశ్, ఎంపీడీవో రవీందర్, కో ఆప్షన్ సభ్యుడు బత్తుల కమలాకర్, పీఏసీఎస్ డైరెక్టర్లు గుడిసె రమేశ్, నాగం శ్రీనివాస్, నాయకులు వేల్పుల దేవస్వామి, పోతరాజు నాగేశ్, అబ్బాస్, మహేశ్, లింగారావు, ప్రసాద్, దేవయ్య ఉన్నారు.
కోనరావుపేట, నవంబర్ 2: నాగారంలో సింగిల్ విండో పరిధిలో కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ సంకినేని రామ్మోహ న్రావు ప్రారంభించారు. ఇక్కడ సర్పంచ్ బాస లావణ్య, వైస్చైర్మన్ మహేశ్యాదవ్, పీఏసీఎస్ డైరెక్టర్ గోపాడి జ్యోతి, ఉప సర్పంచ్ నాగరాజు, గోపాడి సురేందర్రావు తదితరులు ఉన్నారు.