భారతీయ చిత్రసీమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం సోమవారం ఢిల్లీలో వైభవంగా జరిగింది. 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో విజేతలుగా నిలిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో భారత సినీ రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ఫాల్కే అవార్డును రజనీకాంత్ స్వీకరించారు. ఈ అవార్డును తన గురువు బాలచందర్తో పాటు సోదరుడు సత్యనారాయణరావు గైక్వాడ్కు అంకితం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ‘బస్ కండక్టర్గా పనిచేస్తున్న నాలోని నటనా ప్రతిభను తొలుత నా స్నేహితుడు రాజ్ బహదూర్ గుర్తించి ప్రోత్సహించారు. అతడి వల్లే నేను సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టాను. వారితో పాటు నా స్నేహితులు, దర్శకనిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ల యజమానులు, ప్రజలకు ఈ అవార్డు అంకితం ఇస్తున్నా’ అని రజనీకాంత్ పేర్కొన్నారు.
అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో ‘అసురన్’ చిత్రానికిగాను ఉత్తమనటుడిగా ఎంపికైన ధనుష్, ‘మణికర్ణిక’, ‘పంగా’ చిత్రాలతో ఉత్తమనటిగా నిలిచిన కంగనా రనౌత్..ఉపరాష్ట్రపతి నుంచి అవార్డులను స్వీకరించారు. ఉత్తమ సహాయనటుడిగా విజయ్ సేతుపతి అవార్డును అందుకున్నారు. ఉత్తమ జనరంజక చిత్రంగా నిలిచి తెలుగు చిత్రసీమ ఖ్యాతిని చాటిన ‘మహర్షి’ చిత్రాకిగాను నిర్మాతలు దిల్రాజు, శిరీష్, దర్శకుడు వంశీపైడిపల్లి అవార్డులను స్వీకరించారు. ఉత్తమ తెలుగు సినిమాగా నిలిచిన ‘జెర్సీ’ దర్శకనిర్మాతలు గౌతమ్ తిన్ననూరి, సూర్యదేవర నాగవంశీ, ఉత్తమ ఎడిటర్గా నవీన్ నూలి అవార్డులు అందుకున్నారు. ఈ అవార్డుల స్వీకరణ వేడుకలో మామఅల్లుైళ్లెన రజనీకాంత్, ధనుష్ ఒకేసారి పురస్కారాలను అందుకోవడం గమనార్హం.